Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందస్తు ఎన్నికలు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు : సజ్జల

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (13:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ఏ క్షణమైనా తాము ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. ఈ వార్త ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకేముందని ఆయన ప్రశ్నించారు. పైగా, అది చంద్రబాబు రాగమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇప్పటికే అడుగంటిన పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు ముందస్తు డ్రామాకు తెరతీశారని చెప్పారు. మాకు ఐదేళ్లు ప్రజలు అధికారం ఇచ్చారని, ఆ కాలాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన చెప్పారు. ప్రజల్ని మోసం చేయాలి, భ్రమపెట్టాలి అనుకున్నవారే ముందస్తుకు వెళతారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments