Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వచ్చే జన్మలో అబ్బాయిగా పుట్టాలనివుంది : రష్మిక మందన్నా

Advertiesment
వచ్చే జన్మలో అబ్బాయిగా పుట్టాలనివుంది : రష్మిక మందన్నా
, శుక్రవారం, 4 మార్చి 2022 (09:59 IST)
వచ్చే జన్మలో తాను ఖచ్చితంగా అబ్బాయిగా పుడతానని ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా అన్నారు. శర్వానంద్, రష్మికలు జంటగా నటించిన చిత్రం "ఆడవాళ్లూ మీకు జోహార్లు" అనే చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
సీనియర్ నటీనమణులు రాధికా, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. చెరుకూరి సుధాకర్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్ర బృందంలోని కొందరు పాల్గొని, సినిమా విశేషాలు పంచుకున్నారు. 
 
ఇందులో రష్మిక మందన్నా మాట్లాడుతూ, "చాలాకాలం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ సినిమా వస్తోంది. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడండి. చిన్నాపెద్దా అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని భావిస్తున్నా. ఈ సినిమాలోని పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. ఇందులోని సంభాషణలు సినిమాటిక్‌గా కాకుండా మన ఇంట్లో వారితో మాట్లాడినట్టే ఉంటాయి.
 
"పుష్ప" చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ఈ సినిమాలోనూ నటించా. ఒక్కో పాత్రకు ఒక్కో విధమైన వస్త్రధారణ ఉండేది. డ్రెస్సింగ్‌ విషయంలో ఓ మహిళగా చాలా కష్టపడ్డా. వచ్చే జన్మలో నేను ఖచ్చితంగా అబ్బాయిల పుడతా (నవ్వులు). నా పెళ్లి విషయానికొస్తే.. మంచి మనసు, నాకు నచ్చిన వ్యక్తి కనిపిస్తే చేసుకుంటా. దానికి చాలా సమయం ఉందిఛ" అని చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు స్పూర్తి మెగాస్టార్ చిరంజీవి - సూర్య‌