Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుక్కనీటినీ వదులుకోం.. రెచ్చగొడితే రెచ్చిపోం : సజ్జల

Webdunia
సోమవారం, 5 జులై 2021 (06:38 IST)
శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలోకి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్న తెలంగాణా ప్రభుత్వం తీరుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలలో ఒక్క చుక్క నీటిని వదులుకోబోమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అది చేస్తామని అన్నారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశామని, ఈ విషయంపై ఎక్కడ మాట్లాడాలో అక్కడ తప్పకుండా మాట్లాడతామని అన్నారు. వారు రెచ్చగొడితే రెచ్చిపోమని తెలిపారు.

ఆదివారంనాడు కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులనుండి 16వేల క్యూసెక్కులు, పులిచింతలలో ఏడువేల క్యూసెక్కులకు పైగా విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం దిగువకు వదిలారు. హైదరాబాద్‌లో తన ఆస్తులు వున్నందుకే సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నోరుమెదపడం లేదని తెలుగుదేశం విమర్శించింది.

ట్రిబ్యునల్‌ తీర్పుల ప్రకారం రాష్ట్ర నీటివాటాను రాబట్టేందుకు కెసిఆర్‌ సవాల్‌కు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలని తెలుగుదేశం నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments