మృత్యుఒడిలోకి చేరేందుకు గంట ముందు కుటుంబ సభ్యులకు సాయితేజ ఫోన్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (09:32 IST)
భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా ఉన్న చిత్తూరు జిల్లాలోని ఎగువరేగడి గ్రామానికి చెందిన బి.సాయితేజ ఇంట్లోనూ, గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మృత్యువాతపడిన వారిలో సాయితేజ ఒకరు. 
 
ఈయన మృత్యుఒడిలోకి చేరుకునేందుకు గంట ముందు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సంతోషంగా మాట్లాడారు. ఈ విషయాన్ని తలచుకుని సాయితేజ భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. బోరున విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. అలాగే, గ్రామమంతా విషాదచాయలు అలముకున్నాయి. 
 
సాయితేజకు జిల్లాలోని కురబలకోట మండలం ఎగువ రేగడి గ్రామం. ఈ ప్రమాదం జరగడానికి ముందు సాయితేజ తన భార్య శ్యామలకు వీడియోకాల్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన కొద్దిసేపటికే మృత్యుఒడిలోకి జారుకున్నారు. కాగా, ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు, సాయితేజతో పాటు.. మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. హెలికాఫ్టర్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రం 80 శాతం కాలిన గాయాలతో ఆర్మీ  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments