Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత్యుఒడిలోకి చేరేందుకు గంట ముందు కుటుంబ సభ్యులకు సాయితేజ ఫోన్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (09:32 IST)
భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా ఉన్న చిత్తూరు జిల్లాలోని ఎగువరేగడి గ్రామానికి చెందిన బి.సాయితేజ ఇంట్లోనూ, గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మృత్యువాతపడిన వారిలో సాయితేజ ఒకరు. 
 
ఈయన మృత్యుఒడిలోకి చేరుకునేందుకు గంట ముందు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సంతోషంగా మాట్లాడారు. ఈ విషయాన్ని తలచుకుని సాయితేజ భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. బోరున విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. అలాగే, గ్రామమంతా విషాదచాయలు అలముకున్నాయి. 
 
సాయితేజకు జిల్లాలోని కురబలకోట మండలం ఎగువ రేగడి గ్రామం. ఈ ప్రమాదం జరగడానికి ముందు సాయితేజ తన భార్య శ్యామలకు వీడియోకాల్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన కొద్దిసేపటికే మృత్యుఒడిలోకి జారుకున్నారు. కాగా, ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు, సాయితేజతో పాటు.. మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. హెలికాఫ్టర్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రం 80 శాతం కాలిన గాయాలతో ఆర్మీ  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments