Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను మగాడినని నిరూపించుకోవాలి... నన్ను ల్యాబ్‌కు పంపండి : రాజేష్

చిత్తూరు జిల్లా జి.డి.నెల్లూరు మండలంలో పెళ్ళయిన రోజే తన భర్త రాజేష్ నపుంశకుడని అతడి భార్య శైలజ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో వీరి వ్యవహారం కాస్తా రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారి చివరకు కోర్టు మెట్లెక్కింది. అయితే తాజాగా తాను మ

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (20:13 IST)
చిత్తూరు జిల్లా జి.డి.నెల్లూరు మండలంలో పెళ్ళయిన రోజే తన భర్త రాజేష్ నపుంశకుడని అతడి భార్య శైలజ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో వీరి వ్యవహారం కాస్తా రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారి చివరకు కోర్టు మెట్లెక్కింది. అయితే తాజాగా తాను మగాడినే, తనకు లైంగిక పటుత్వ పరీక్షలు  చేయండంటూ చిత్తూరు కోర్టును ఆశ్రయించాడు రాజేష్. 
 
ఇప్పటివరకు క్రిమినల్ కేసుల్లో లైంగిక పటుత్వ పరీక్షలు చేసిన దాఖలాలు లేవని రాజేష్ తరపు న్యాయవాది త్రిమూర్తి చెబుతున్నారు. అయితే రాజేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను తనకు పొటెన్సీ పరీక్ష చేయాలని పట్టుబడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం చిత్తూరు మూడవ అదనపు కోర్టులో రాజేష్ పిటిషన్‌ను దాఖలు చేస్తే ఇప్పటివరకు కూడా న్యాయమూర్తి విచారణ జరపలేదు. 
 
గత రెండురోజులుగా వాయిదా వేస్తూనే వస్తున్నారు. త్వరగా తనను పొటెన్సీ పరీక్షలకు పంపించాలని రాజేష్ వేడుకొంటున్నాడు. నేను మగాడినని నిరూపించుకునేందుకు ఇదొక్కటే నాకున్న అవకాశమంటూ న్యాయమూర్తికి ఒక వినతిపత్రం కూడా రాజేష్ రాసి బంధువుల ద్వారా కోర్టుకు పంపాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం