Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మండ్రి నుంచి పంచారామ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (10:58 IST)
దేవాల‌యాల‌యాల‌కు నిల‌యం అయిన రాజమహేంద్రవరంలో కార్తీక మాసం శోభాయ‌మానంగా నిర్వ‌హిస్తున్నారు. ఇక్క‌డ గోదావ‌రి ఒడ్డున భ‌క్తుల సంచారం రోజు రోజుకూ పెరుగుతోంది. 
 
అందుకే రాజ‌మండ్రి కేంద్రంగా పంచారామ క్షేత్రాలకు తూర్పుగోదావ‌రి జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి ప్రత్యేక ప్యాకేజీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఆర్టీసీ అధికారులు తెలిపారు. కార్తిక మాసంలో పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం నవంబరు 7, 14, 21, 28 తేదీల్లో ఎక్స్‌ప్రెస్‌, ఆల్ట్రా డీలక్స్‌, సూపర్ లగ్జరీ బస్సులను ప్రత్యేక ప్యాకేజీ సర్వీసులుగా నడపనున్నట్లు చెప్పారు. కార్తిక సోమవారాల్లో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట పంచారామ క్షేత్రాలయాలను భక్తులు సందర్శించేలా ఆదివారం రాత్రే ఆయా డిపోల నుంచి బస్సులు బయలుదేరేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 
 
డిపోల వారీగా పెద్దలకు, పిల్లలకు టికెట్‌ ఛార్జీ నిర్ణయించడంతోపాటు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. భ‌క్తుల‌ను ఆయా రోజుల్లో పంచారామాల‌న్నీ తిప్పి, తిరిగి రాజ‌మండ్రికి చేరుస్తామ‌ని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ టూర్ ప్యాకేజీలో అన్ని క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తున్నామ‌ని, భ‌క్తులు ఈ సౌక‌ర్యాన్ని వినియోగించాల‌ని కోరారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments