అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి, తిరుమలకు మాత్రం?

Webdunia
గురువారం, 21 మే 2020 (20:28 IST)
రాష్ట్ర ప్రభుత్వ లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రరోడ్డు రవాణా సంస్ధ అధికారులు బస్సులను రోడ్లపై నడుపుతున్నారు. ఉదయం 7గంటల నుంచే బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతి లాంటి ప్రాంతంలో అయితే మొత్తం 115 బస్సులు నడుస్తున్నాయి. 
 
గతంలో తిరుపతి బస్టాండులో ప్రతిరోజు 30 నుంచి 40 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించేవారు. వారిలో 75శాతంకి పైగా పుణ్యక్షేత్రాల సందర్సనకు వచ్చేవారే. అయితే రెండు నెలల పాటు లాక్ డౌన్.. ఆలయాలను మూసివేసిన నేపథ్యంలో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని పుణ్యక్షేత్రాలకు బస్సులను నడపటం లేదు. 
 
ముఖ్యంగా తిరుమల పుణ్యక్షేత్రానికి 400కి పైగా సర్వీసులు ప్రతిరోజు నడుస్తుంటాయి. అలాంటిది ప్రస్తుతం తిరుమల బస్టాండ్ ఖాళీగా కనిపిస్తోంది. తిరుమల ఆలయంలోకి భక్తులను అనుమతిని నిలిపివేయడం.. తిరుమల ఘాట్ రోడ్లను రెండింటిని మూసివేయడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. 
 
దీంతో తిరుమలతో పాటు తిరుచానూరు, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాసమంగాపురం ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నడపటం లేదు. ఏడుకొండల బస్టాండ్‌లో ఇసుకేస్తే రాలనంత జనం ఎప్పుడూ కనబడుతూ ఉంటుంది. ఎప్పుడూ  ప్రయాణీకుల రద్దీ ఈ ప్రాంతంలో కనిపిస్తుంటుంది. అయితే పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుపుతుండడం.. రెండు నెలల క్రితం తిరుపతికి వచ్చిన వారు తిరిగి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోవడం.. వారు మాత్రమే ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లను బస్సులను బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments