Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ వరద బాధితులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ ఉద్యోగులు రూ.2.91 కోట్ల విరాళం

అమరావతి : వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ వాసులకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ ఉద్యోగులు రూ.2,91,43,466 విరాళం అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అసెంబ్లీలోని ఒకటో అంతస్తు కమిటీ హాలులో గురువార

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (15:00 IST)
అమరావతి : వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ వాసులకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ ఉద్యోగులు రూ.2,91,43,466 విరాళం అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అసెంబ్లీలోని ఒకటో అంతస్తు కమిటీ హాలులో గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం తెలిపారు. 
 
వరదలతో కేరళ అతలాకుతలమైందన్నారు. ప్రాణ, ఆస్తినష్టం కలిగిందన్నారు. ఈ విషాదకర సమయంలో కేరళ వాసులకు అండగా ఉండాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సాయం అందించిందన్నారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అసెంబ్లీ ఉద్యోగులు కూడా ఒక నెల వేతనంతో పాటు ఇతర అలెవెన్సులు విరాళం ఇవ్వాలని నిర్ణయించారన్నారు. 
 
శాసన సభ్యులు రూ.2,70,28,466, శాసన మండలి సభ్యులు రూ. 19,90,000, అసెంబ్లీ ఉద్యోగులు రూ.1,25,000 కలిపి మొత్తం రూ. 2,91,43,466 విరాళంగా అందజేయనున్నారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సెకండ్ సింగిల్ హే జింగిలి..రాబోతుంది

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments