Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరానికి రూ.1,850 కోట్లు... విత్తమంత్రి నిర్మల ఆదేశం

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (17:25 IST)
గతంలో పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,850 కోట్లను రీయింబర్స్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉత్తర్వులిచ్చారు. ఆ నిధులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయాలని నాబార్డుకు ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ సొమ్మును సెబీ(సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) పరిధిలో ఈ-ఆక్షన్‌ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా బాండ్లను జారీ చేసింది నాబార్డ్.. దాంతో రూ.1,850 కోట్లు రావడంతో ఆ మొత్తాన్నిత్వరలోనే పీపీఏకు పంపనుంది. పీపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయనుంది. 
 
కాగా గతేడాది జులైలో పోలవరానికి నిధులు మంజూరు చేసిన కేంద్రం.. ఆ తరువాత ఇదే ఇంత పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేయడం విశేషం. కాగా, పోలవరం పనులకు ఇటీవల రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రూ.841.33 కోట్లు ఆదా అయ్యాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments