Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాక్ గార్డెన్‌లో ఏపీ పర్యాటక మంత్రి ఆర్.కె.రోజా

Webdunia
శనివారం, 21 మే 2022 (15:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సినీ నటి ఆర్కే రోజా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఆమె తన వంతు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ఆమె సందర్శిస్తున్నారు. ఇందులోభాగంగా ఆమె శనివారం కర్నూలు జిల్లాలోని రాక్ గార్డెన్‌ను సందర్శించారు. ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతమని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. 
 
ముఖ్యంగా, ఓర్వకల్లులో ఉన్న ఈ రాతి ఉద్యానవనంలో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాతి రెస్టారెంట్, కేవ్ మ్యూజియం, బోటింగ్, పిక్నిక్ స్పాట్లు, హరిత రిసార్టు ద్వారా వసతి అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఓర్వకల్లు రాక్ గార్డెన్ పర్యాటక ప్రదేశంగా చాలా అద్భుతంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఒక్క టూరిజం స్పాట్‌గానే కాకుండా సినిమా షూటింగులకు ఎంతో అనువుగా, అందంగా ఉంటుందని చెప్పారు. 
 
గతంలో ఇక్కడ "జయం మనదేరా, టక్కరిదొంగ, సుభాష్ చంద్రబోస్, బాహుబలి" వంటి చిత్రాలను చిత్రీకరించినట్టు ఆమె గుర్తుచేశారు. కాగా, ఈ రాతి ఉద్యానవనం కర్నూలు జిల్లా కేంద్రానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి రోజా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments