మరోమారు బాదుడుకు సంకేతాలు ఇచ్చిన ఎయిర్‌టెల్

Webdunia
శనివారం, 21 మే 2022 (15:30 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ మరోమారు తన కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. యూజర్ చార్జీలను 10 నుంచి 20 శాతం మేరకు పెంచాలని భావిస్తుంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో గోపాల్ మిట్టల్ సంకేతాలు ఇచ్చారు. 
 
గత యేడాది నవంబరు - డిసెంబరు నెలలో ఈ కంపెనీ భారీగా చార్జీలను పెంచిన విషయం తెల్సిందే. అపుడు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు 18 నుంచి 25 శాతం మేరకు టారిఫ్‌లను పెంచేశాయి. ఇపుడు మరో విడత పెంపునకు సిద్ధమవుతున్నాయి. 
 
గతంలో పెంచిన పెంపుదలతో ఒక్కో యూజర్ నుంచి ఎయిర్ టెల్ కంపెనీ నెలకు సగటున రూ.178 వరకు ఆదాయాన్ని అర్జిస్తుంది. దీన్ని రూ.200కు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ కంపెనీ సీఈవో గోపాల్ మిట్టల్ తెలిపారు. అంటే త్వరలోనే ఎయిర్‌టెల్ చార్జీలను పెంచనున్నట్టు స్పష్టమైన సంకేతాలు వెలువరించారు. 
 
ప్రస్తుతం ప్రీపెయిడ్ చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని, వీటి కనీస ధరను రూ.200గా చేర్చాల్సిన అవరం ఎంతైనా ఉందని గోపాల్ మిట్టల్ అన్నారు. అంటే కనీసం 10 నుంచి 20 శాతం మేరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments