Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు పప్పుకు జోడీగా రాహుల్ పప్పు వచ్చి చేరారు-రోజా

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (15:02 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు పప్పు నారా లోకేష్‌కి తోడుగా రాహుల్ పప్పు వచ్చి చేరారని విమర్శించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తును రోజా తప్పుబట్టారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పని అయిపోయినట్టేనని రోజా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ.. ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన వీణ వాయించుకుంటూ కూర్చోవాలన్నారు. 
 
విపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం జరిగితే వెకిలి నవ్వులు నవ్వుతున్నారని రోజా మండిపడ్డారు. గత ఎన్నికల్లో తమ అధినేత జగన్మోహన్‌ని గెలవకుండా చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్నారన్నారు. ప్రజలను మోసం చేసి చంద్రబాబు గద్దెనెక్కారని రోజా ఆరోపించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదన్నారు. 
 
జగన్‌కు పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని రోజా ఆరోపించారు. పలు కేసులున్న క్రిమినల్‌ని ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లో పెట్టుకున్నారని.. దాడి తర్వాత విపక్ష నేత జగన్‌పై టీడీపీ నేతలు ఎలా మాటల దాడి చేశారో ప్రజలు అందరూ చూశారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments