Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీ అయినా ఓసీ అయినా తప్పు చేస్తే శిక్ష తప్పదు.. రోజా

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (12:55 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతితో దొరికిపోయాడని... ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకల్లో జరిగిన అవినీతితో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పేద కార్మికుల వైద్యానికి కేటాయించిన డబ్బును అచ్చెన్నాయుడు దోచుకున్నారని ఆమె మండిపడ్డారు. తప్పు చేసి వివరణ ఇస్తే సరిపోదని రోజా అన్నారు. తప్పు చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. 
 
తప్పు చేశారే కాబట్టే మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసిందని రోజా చెప్పుకొచ్చారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకావడం లేదని రోజా విమర్శించారు. తప్పు చేసిన వ్యక్తి బీసీ అయినా ఓసీ అయినా... చట్టం ముందు అంతా సమానమే అని వ్యాఖ్యానించారు. 
 
నారా లోకేశ్ మాటలకు విలువ లేదని... ప్రజల్లో గెలవలేని వ్యక్తి చెప్పే మాటలు ఎవరూ పట్టించుకోరని ఆమె అన్నారు. తాము తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోవచ్చని గతంలో తొడగొట్టిన లోకేశ్... సాక్ష్యాలతో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే ఎందుకు మండిపడుతున్నాడని రోజా విమర్శించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments