Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాత్రంతా నిద్రపోనివ్వలేదు ... వస్తువులు ధ్వంసం చేశారు : అచ్చెన్న భార్య

రాత్రంతా నిద్రపోనివ్వలేదు ... వస్తువులు ధ్వంసం చేశారు : అచ్చెన్న భార్య
, శుక్రవారం, 12 జూన్ 2020 (12:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలో రూ.150 కోట్ల ఈఎస్ఐ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈ కేసులో శుక్రవారం వేకువజామున టీడీపీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అయితే, అరెస్టుకు ముందు ఏం జరిగిందో అచ్చెన్నాయుడు భార్య విజయ మాధూరి మీడియాకు వివరించారు. 
 
గురువారం రాత్రి 7.30 గంటలకే తమ ఇంటిని చుట్టుముట్టిన కొందరు, తాము ఏసీబీ అధికారులమంటూ ఇంట్లోకి వచ్చారని, తమకు ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితుల్లోనే రాత్రంగా గడచిపోయిందన్నారు. 
 
పైగా, తన భర్తకు ఇటీవలే సర్జరీ జరిగిందన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. రాత్రంతా తన భర్తను నిద్రపోనివ్వలేదని, ఇల్లంతా సోదాలు చేశారని, కొన్ని వస్తువులను నాశనం చేశారని ఆమె ఆరోపించారు. 
 
అర్థరాత్రి తర్వాత ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు అధికారులు చెప్పారని, ఆపై తామెంత చెప్పినా వినకుండా తీసుకెళ్లిపోయారని అన్నారు. తన భర్తకు ఏదైనా ఆపద సంభవిస్తే, ప్రభుత్వానిదే బాధ్యతని అని ఆమె హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్ ... ఆమెకు కరోనా అని తేలడంతో...