Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులివెందుల వద్ద 30 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు

ఠాగూర్
బుధవారం, 23 అక్టోబరు 2024 (10:53 IST)
కడప జిల్లాలోని పులివెందులలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థకు చెందిన పల్లెవెలుగు బస్సు ఒకటి లోయలో పడిపోయింది. ఎదురుగా వస్తున్న వాహనానికి తప్పించే ప్రయత్నంలో భాగంగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
కదిరి నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు పులివెందుల సమీపంలోని డంపింగ్ యార్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో డ్రైవర్ బ్రేకులు వేశారు. దీంతో బస్సు నియంత్రణ కోల్పోయి చెట్లను ఢీకొట్టుతూ 30 అడుగుల లోతులో పడిపోయింది. క్షతగాత్రులను టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పరామర్శించారు. పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వైద్యులకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments