మంచంపై కూర్చొన్నవారిపైకి దూసుకెళ్లిన వ్యాను...

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (14:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని సీకే దిన్నె మండలంలో మద్దిముడుగులో ఈ ప్రమాదం జరిగింది. 
 
వేగంగా వెళుతున్న వ్యాను ఒకటి అదుపుతప్పి ఆరు బయట మంచంపై కూర్చొనివున్న నలుగురిపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు మృతి చెందారు. కడప, బెంగుళూరు, జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రామంలో కడప నుంచి రాయచోటికి వెళుతున్న జిప్సీ వ్యాన్ ఈ ప్రమాదానికి గురైంది. 
 
ఈ ప్రమాదంలో కొండయ్య, లక్ష్మీదేవి అనే ఇద్దరు సంఘటనలో మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ గాయపడిన ఇద్దరు యువతులైన అమ్ములు, దేవిని కడపలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, వీరిద్దరు కూడా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొండయ్య, అమ్ములు భార్యాభర్తలు కాగా, లక్ష్మీదేవి, దేవి వారి ఇంటి పక్కనే ఉండే కుటుంబ సభ్యులని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments