Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి రోజా భర్తకు ఏమైంది..? లొకేషన్లు ఎలా సెలక్ట్ చేసుకుంటారో తెలియదా?

Webdunia
బుధవారం, 4 మే 2022 (14:32 IST)
ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణి కొత్త వివాదానికి తెరలేపారు. ఏపీ, తెలంగాణలో తమిళ చిత్రాల షూటింగ్‌లు జరుగుతున్నాయని అలా చేయవద్దని ఆయన ఉద్యమం లేవదీశారు. కొద్ది కాలంగా తమిళ భారీ చిత్రాల షూటింగ్‌లు ఎక్కువగా హైదరాబాద్, విశాఖల్లో జరుగుతున్నాయి. 
 
ఇది ఫెప్సీ పేరుతో ఓ సినీ కార్మిక సంఘాన్ని నడుపుతున్న ఆర్కే సెల్వమణికి నచ్చలేదు. తన సంఘంలోని సభ్యులకు పనులు ఉండటం లేదని సెల్వమణి వివాదం ప్రారంభించారు. తాము సినిమా షూటింగ్‌లు చేయడానికి.. పనికిరామా అంటూ ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
 
నిజానికి దర్శకుడు అయిన సెల్వమణికి షూటింగ్ లొకేషన్లు ఎలా సెలక్ట్ చేసుకుంటారో తెలుసు. కథను బట్టి షూటింగ్ చేసుకుంటారు. కానీ లేనిపోని వివాదం రేపి.. తెలుగురాష్ట్రాల్లో షూటింగ్‌లు వద్దని రచ్చ చేస్తున్నారు.
 
అంతేగాకుండా తమిళ సినీ కార్మికులకు పనులు ఉండటం లేదని అగ్రహీరోలందరూ హైదరాబాద్ , విశాఖల్లో షూటింగ్‌లు చేస్తున్నారని ఆయన అంటున్నారు. 
 
ఈ అంశంపై రజనీకాంత్, విజయ్ స్పందించారని.. తమిళ సినిమాల షూటింగ్‌లు చెన్నైలోనే చేయడానికి అంగీకరించారని.. అజిత్ ఇంకా స్పందించాల్సి ఉందంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments