Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్, అల్లు అర్జున్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి.. రోజా డిమాండ్ (Video)

సెల్వి
శనివారం, 9 నవంబరు 2024 (21:26 IST)
RK Roja
మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా కూటమి సర్కారుపై ఫైర్ అయ్యారు. ఏపీలో పరిపాలన చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత పాలనలో ఉన్నామా అనే సందేహం వస్తోందన్నారు. హిట్లర్, గడాఫీ ఇద్దరు కలిసి కూర్చుని పాలిస్తే ఎలా ఉంటుందో, అలా ఏపీలో పాలన సాగుతోందంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను నియంత్రించలేక ఏపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ఇంట్లోని వారే మహిళలా.. వైసీపీ నేతల ఇళ్లల్లో మహిళలు లేరా అని రోజా ప్రశ్నించారు. 
 
"పవన్ కళ్యాణ్‌కు ఆడవాళ్ల మీద గౌరవం లేదు. జనసేన, టీడీపీ వాళ్లు పెట్టే పోస్టులు ఆపలేరు. హీరో ప్రభాస్ మీద మెగాఫ్యాన్స్, జనసైనికులు పెట్టిన ఘోరమైన పోస్టులను తప్పని ఎప్పుడైనా ఆపించారా? వారిపై కేసులు పెట్టించారా? అల్లు అర్జున్ మీద, ఆయన కుటుంబం మీద పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా దిగజారుడుతనంగా పోస్టులు పెట్టింది. దానిని ఆపారా..? అంటూ ప్రశ్నించారు. ఇంకా హీరో ప్రభాస్, అల్లు అర్జున్ మీద పోస్టులు పెట్టిన వారిపైనా చర్యలు తీసుకోండి" అంటూ మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments