Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు: మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (07:15 IST)
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం క్రమేపి పెరుగుతోంది. పాఠశాలలు ప్రారంభం నుంచి 40 నుంచి 50 శాతం మధ్య నడుస్తున్న హాజరు క్రమేణా 60 శాతం చేరుకుంటోంది. బుధవారం 8వ తరగతి విద్యార్థులు 57 శాతం హాజరు కాగా కొన్ని చోట్ల 68 శాతం నమోదైంది.  ప్రతిరోజూ 50శాతం తగ్గకుండా విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. విద్యార్థుల హాజరుకు సంభందించిన వివరాలను  విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
 
బుధవారం 10వ తరగతి విద్యార్థులు 52.15 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 6,74,733 మందికి గాను 351877 మంది హాజరయ్యారు.9వ తరగతి విద్యార్థులు  శాతం విద్యార్థులు, 6,84,722 మందికి 316032 మంది హాజరయ్యారు. 8వ తరగతి విద్యార్థులు 56.30 శాతం 6,81,917 మందికి గాను 383938 మంది హాజరయ్యారు.

గుంటూరు జిల్లాలో 8వ తరగతి విద్యార్థులు అత్యధికంగా 68.93 శాతం హాజరయ్యారు. కాగా కడపలో 61 శాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు కూడా 61శాతం హాజరయ్యారు. పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రశాంత వాతావరణంలో తరగతులు జరుగుతున్నాయి.

ఇదే విధంగా పాఠశాలలకు తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుండటంతో డిసెంబర్ 14 తరువాత 6, 7 తరగతులు కూడా నిర్వహించడం కోసం చర్యలు తీసుకుంటున్నాం.
 
కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో, కళాశాలల్లో  విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు.  ప్రతిరోజూ కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్ లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. మాస్క్, శానిటైజేషన్, సామజిక దూరం విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments