Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం .. రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్లు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (09:14 IST)
అసలే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్ర విభజన కారణంగా నవ్యాంధ్రకు రెవెన్యూ లోటు భారీగా ఏర్పడిన విషయం తెల్సిందే. దీన్ని భర్తీ చేసే చర్యల్లో భాగంగా ఈ నిధులను దశల వారీగా విడుదల చేస్తుంది. 
 
మొత్తం 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద రూ.7183 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ నిధులతో కలుపుకుని ఇప్పటివరకు ఏపీకి మొత్తం రూ.7032 కోట్ల నిధులు రెవెన్యూ లోటు కింద వచ్చాయి. 
 
దేశంలో రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాల్లో ఏపీ, అస్సోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్‌తో సహా మొత్తం 14 రాష్ట్రాలు ఉన్నాయి. 
 
ఈ రాష్ట్రాల రెవెన్యూ లోటు కింద మంగళవారం కేంద్రం రూ.7183 కోట్లను విడుదల చేయగా, వీటిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఖజానాకు రూ.1132 కోట్లు వచ్చి చేరాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments