Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ : బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలు

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (17:16 IST)
సింగరేణి బొగ్గు గనుల్లోని వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గును కావాల్సిన వారికి కేసిఆర్ ప్రభుత్వం కట్టబెడుతోందని ప్రధాని మోదీకే నేరుగా ఫిర్యాదు చేసినా ఏమీ జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి  విమర్శించారు.
 
దొంగ సొమ్మును పంచుకోవడానికి ఇద్దరూ కుమ్మక్కైయ్యారని, బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. 
 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నేడు ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ను కలిశారు. 
 
మాణిక్కం ఠాగూర్‌తో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ దోపిడీని బీజేపీ చూసిచూడనట్లు వ్యవహరించడంవల్ల, బీజేపీకి ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో నిధులను కేసీఆర్ సమకూర్చుతున్నారన్నారు. 
 
సింగరేణి దోపిడీపై సీబీఐ చేత పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ఇచ్చిన విజ్ఞప్తిపై ప్రధాని వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆదానీ సంస్థకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని, ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసినా, కేంద్రానికి 49 శాతం వాటాలున్నా, కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై ప్రధాని మోడి పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments