Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృత్వానికే మాయని మచ్చ.. మైక్రో ఓవెన్‌లో పెట్టి..?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (17:05 IST)
మాతృత్వానికే మాయని మచ్చ తెచ్చింది. కన్నబిడ్డను అత్యంత దారుణంగా హత్య చేసింది. రెండు నెలల పసిగుడ్డును అత్యంత దారుణంగా గొంతు నులిమి చంపి ఆ తరువాత మృతదేహాన్ని మైక్రో ఓవెన్‌లో పెట్టి కాల్చింది. ఈ అత్యంత దారుణం ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే., ఢిల్లీలోని మాలవీయ నగర్​లో రెండు నెలల కన్నకూతుర్ని గొంతు నులిమి దారుణంగా హత్య చేసి చిన్నారి మృతదేహాన్ని ఒవెన్​లో పెట్టింది. 
 
మాలవీయ నగర్​లోని చిరాగ్ ఏరియాలో గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంప‌తుల‌కు రెండు నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని డింపుల్ బిడ్డ గొంతు నులిమి చంపేసింది. ఆ తరువాత వంట గదిలోని మైక్రోఓవెన్‌లో పెట్టింది. 
 
ఈ దృశ్యాలను వేరే గదిలో ఉన్న చిన్నారి నానమ్మ చూడటంతో బిగ్గరగా అరిచింది. దీంతో స్థానికులు ఆమె అరుపులకు పరుగులు తీసుకుంటూ వచ్చినా ఆ చిన్నారిని కాపాడలేకపోయారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్‌ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments