Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరువారాల్లోగా రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (11:43 IST)
నవ్యాంధ్ర రాజధానిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను కల్పించింది. తొలి సమావేశం జరిగిన ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళిక రూపకల్పన కోసం నియమించిన నిపుణుల కమిటీ విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో నిపుణుల కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటన చేసేందుకు అధికారాలు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

సమాచార సేకరణ కోసం అన్ని స్థాయిల్లోని ప్రభుత్వోద్యోగులతో సంప్రదింపులు జరిపే అధికారాన్ని నిపుణుల కమిటీకి ప్రభుత్వం కట్టబెట్టింది. క్షేత్రస్థాయి పర్యటనలు వివిధ వర్గాలతో నిపుణుల కమిటీ సంప్రదింపులు జరపనుంది. కమిటీ కార్యాకలాపాల నిర్వహణకు కావాల్సిన సిబ్బంది ఇతర అవసరాలను సీఆర్డీఏ సమకూర్చనుంది.

ప్రభుత్వంతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసరుగా సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయ కృష్ణన్ వ్యవహరించనున్నారు. తొలి సమావేశం జరిగిన ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments