Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలు పిల్లతో శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ (video)

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (13:40 IST)
Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ శుక్రవారం పూట కలియుగ వైకుంఠం శ్రీవారి దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు.

Ambani
ఈ సందర్భంగా తిరుమల వెంకన్నకు ముఖేష్ అంబానీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనలో కోడలు రాధిక మర్చంట్‌తో కలిసి వచ్చారు ముఖేష్ అంబానీ. 
mukesh Ambani
 
అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అంబానీని సాదరంగా స్వాగతించి.. స్వామివారి దర్శనానికి అన్నీ ఏర్పాట్లు చేసారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుని మండపం వద్ద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. 
mukesh Ambani
 
ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ తిరుమలను సందర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరుమల ప్రతిఏటా అభివృద్ధి చెందుతూ వుండాలని ఆకాంక్షించారు. తిరుమల వెంకన్న ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించాలని ఆశించారు. 
mukesh Ambani
 
అంతేగాకుండా శ్రీవారి దర్శనానికి వచ్చిన అంబానీ.. గజరాజులకు అరటి పండ్లను ఆహారంగా అందించారు. అంబానీ వెంటనే ఆయన కోడలు రాధిక వున్నారు. 
mukesh Ambani


ఆమె కూడా ఏనుగులకు అరటి పండ్లను అందించారు. ఇక శ్రీవారి పర్యటనకు వచ్చిన ముఖేష్ అంబానీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments