ఐజీఎస్టీ బకాయిలు త్వరగా విడుదల చేయండి: మంత్రి బుగ్గన

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:14 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (వర్చువల్ సమావేశం) ఢిల్లీ నుంచి జరిగింది. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ, 2020-21 సంవత్సరంలో రావాల్సిన కాంపెన్సేషన్  బకాయిలలో కొంత విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

మిగిలిన ఐజీఎస్టీ బకాయిలు కూడా త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంచే విధించి వసూలు చేయబడుతున్న సెస్సులు, సర్ ఛార్జీలు, డివిజబుల్ పూల్ లేనందువల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గి ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలకు పట్ల కేంద్రంగా ఉదారంగా వ్యవహరించాలని కోరారు.

కౌన్సిల్ సమావేశంలో ప్రాముఖ్యత ఉన్న అంశాలను అంగీకారం తెలుపుతూ వాటికి సరైన విధాన రూపకల్పన చేయాలని సూచించారు. కాంపెన్సేషన్ విషయంలో ఏకాభిప్రాయం కొరకు మరిన్ని సమావేశాలు, లోతైన అధ్యయనం జరగాలని తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులతో పాటు ప్రస్తుతం కొవిడ్ వల్ల ప్రజారోగ్యం మీద అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుండడంతో రాష్ట్రాల వనరులపై అదనపు భారం పడుతోందని చెబుతూ, ప్రస్తుత క్లిష్ట సమయంలో కేంద్రం వెంటనే అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments