Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక కొత్త సాఫ్ట్ వేర్ తోనే రిజిస్ట్రేషన్లు: డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (20:14 IST)
రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కొత్త సాఫ్ట్ వేర్ సహాయంతోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నకిలీ చలానాల కుంభకోణంపై ఆ శాఖ ఐజి శేషగిరి బాబుతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన అనంతరం మాట్లాడారు.

అదనపు ఐజి ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి రెండు దశలలో కుంభకోణానికి సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించామన్నారు. రాష్ట్రం మొత్తం మీద 11 జిల్లాలో 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సొమ్ము పక్కదారి పట్టినట్లు గుర్తించామని ఆ మొత్తం రూ.7,13,76,148ల గా ఉందని చెప్పారు.

దీనిలో ఇప్పటి వరకు రూ.3,38,11,190 వసూలు చేశామని వెల్లడించారు. సంబంధిత వ్యక్తులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని, ప్రమేయం ఉన్న ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. బోగస్ చలాన్ల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లపై ఏం చేయాలనే దానిపై న్యాయ సలహా కూడా తీసుకొంటున్నామని, అధికారులు దర్యాప్తును వేగంగా పూర్తి చేశారని అన్నారు.

రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారానే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయని, రిజిస్ట్రేషన్ల సేవలు మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తున్నామని కృష్ణదాస్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments