Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెకె రాజు ఇంటికి వెళ్ళి అభినందించిన డిప్యూటీ సీఎం ధ‌ర్మాన

కెకె రాజు ఇంటికి వెళ్ళి అభినందించిన డిప్యూటీ సీఎం ధ‌ర్మాన
విజయవాడ , శుక్రవారం, 20 ఆగస్టు 2021 (12:23 IST)
విశాఖ వైసీపీ నేత కె కె రాజు ఇంటికి వెళ్ళి మ‌రీ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణదాస్ త‌న అభినంద‌న‌లు తెలిపారు. నెడ్ క్యాప్ చైర్మన్ గా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కే కే రాజుకు భారీగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

నెడ్ క్యాప్ ఛైర్మ‌న్ గా ఎంపిక అయిన కెకె.రాజు హైద‌రాబాదు నుంచి విశాఖ‌కు భారీ ర్యాలీతో రాగా, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆయ‌న‌ నివాసానికి స్వయంగా వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ప‌లువురు విశాఖ కార్పొరేట‌ర్లు, మాజీలు, సీనియ‌ర్ నాయ‌కులు కెకె రాజుకు విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వైసీపీ క్యాడ‌ర్ సీత‌మ్మ ధార నుంచి భారీగా బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. కెకె రాజు జిందాబాద్ అంటూ నినాదాల‌తో విశాఖ‌ను మ‌రు మ్రోగించారు.

త‌న‌కు నెడ్ క్యాప్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చినందుకు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కె కె రాజు కృత‌జ్ణ‌త‌లు తెలిపారు. ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి, నామినేటెడ్ ప‌ద‌వి క‌ల్పించినందుకు ఆయ‌న‌కు కూడా కృత‌జ్న‌త‌లు తెలిపారు. నెడ్ క్యాప్ కు రాష్ట్రం అంతా 12 జిల్లాల‌లో కార్యాల‌యాలు ఉన్నాయ‌ని, ఇక విశాఖ‌లో రాష్ట్ర కార్యాల‌యాన్ని త్వ‌ర‌లో ఏర్పాటు చేస్తామ‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5 రోజుల పాటు ఆడ‌వారికి ఆర్టీసీ బ‌స్సు ఫ్రీ... ఎక్క‌డ‌?