Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ‌లో డెంట‌ల్ క్లినిక్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం

Advertiesment
విశాఖ‌లో డెంట‌ల్ క్లినిక్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం
విజయవాడ , సోమవారం, 23 ఆగస్టు 2021 (10:05 IST)
విశాఖ ప‌ట్నంలో 4డిఎస్ డెంటల్ క్లినిక్ ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. విశాఖ పట్నం సీతమ్మధార జీవీఎంసి 14  వ వార్డు పరిధిలోని బాలయ్య శాస్త్రి లేఔట్లో డాక్టర్ సుధాకర్ పట్నాయక్ ఆధ్వ‌ర్యంలో 4డిఎస్ డెంటల్ క్లినిక్ ను ప్రారంభించారు.

ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వైద్య సేవ‌ల‌ను ప్రారంభించారు. విశిష్ట అథితులుగా విశాఖపట్నం కాకినాడ పెట్రొలియం కెమికల్ & పెట్రోకెమికల్ ఇన్వెస్టుమెంట్ రీజియన్ చైర్ పర్సన్ చొక్కాకుల లక్ష్మి వెంకటరావు, రాష్ట్ర శిష్టికరణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్ ప‌ర్సన్ అనూష పట్నాయక్, డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విశాఖ‌లో వైద్య‌సేవ‌లు అందించే ఆసుప‌త్రుల క‌ల్ప‌న‌పై దృష్టి పెట్టాల‌ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఇ.ఎన్.టి. వైద్యుల అవ‌స‌రం ఇపుడు ఎంతో ఉంద‌న్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ‌రుడ వాహ‌నం...స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం; తిరుమ‌ల‌లో శ్రీవారి సేవ‌