Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ కారణంగానే మంత్రి గౌతం రెడ్డికి గుండెపోటు వచ్చిందా?

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (16:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రిగా విధులు నిర్వహిస్తూ వచ్చిన మేకపాటి గౌతం రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుకుగురై ఆ తర్వాత హఠాన్మరణం చెందారు. ఆయన మృతితో మేకపాటి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. అయితే, చిన్నవయసులోనే ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గౌతం రెడ్డి.. శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. కానీ, ఆయన గుండెపోటుతో మరణించారంటే చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే, గతంలో ఆయన రెండుసార్లు కరోనా వైరస్ బారినపడ్డారు. అందువల్లే ఆయనకు గుండెపోటు వచ్చివుంటుందని మరికొందరు భావిస్తున్నారు. 
 
ఇదే అశంపై ప్రముఖ కార్డియాలజిస్టులు స్పందిస్తూ, గౌతం రెడ్డి మరణానికి కోవిడ్ అనంతర దుష్ప్రభావాలే కారణం అయివుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న రోగుల్లో గుండెపోటు అనేది సర్వసాధారణం అయిపోయిందని ఆయన గుర్తుచేస్తున్నారు. 
 
కాగా, దుబాయ్‌ ఎక్స్‌పోలో ఆయన ఏపీ ప్రభుత్వం తరపున పాల్గొన్నారు. అక్కడ ఆయన కీలక ప్రసంగం చేశారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఆదివారం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఆ తర్వాత నెల్లూరులో తమ బంధువుల ఇంట జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో ఆయన పాల్గొని, తిరిగి హైదరాబాద్ వెళ్లారు. కానీ, సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందడాన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments