Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం: రఘురామ

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (16:15 IST)
అమరావతి రాజధాని భూముల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని ఎంతో కాలంగా నిందలు వేశారని, ఇప్పుడేమంటారని వైసీపీ నేతలను ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలను ప్రచారం చేశారని, దాని వల్ల 150 మందికి పైగా రైతులు మృతి చెందారని తెలిపారు. వారి చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించి, సీఎం జగన్‌ ఓదార్చాలని కోరారు. విశాఖలో తమ ప్రభుత్వం వచ్చాక ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని ఎత్తి చూపారు. దసపల్లా హోటల్ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయో తెలాలని, నిజాయితీగల అధికారితో ఉత్తరాంధ్రలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా అంశంపై సీఎం ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం సిద్ధమని రఘురామ ప్రకటించారు. ‘‘నాపై అనర్హత వేటు పడదు. మీ బెయిల్ రద్దు చేయమని అనడం రాజద్రోహం ఎలా అవుతుంది. వాట్సాప్‌లో చాటింగ్ బయట పెట్టామని అంటున్నారు.. నా ఫోన్ పోలీసులు తీసుకున్నారు. పెగసెస్ సాఫ్ట్‌వేర్ మీరు తెప్పించారని అంటున్నారు. మీరు చాలా మందిపై వాడారని అంటున్నారు, మీరు కేంద్రం అనుమతి తీసుకున్నారా?’’ అని రఘురామ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments