Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ ఛార్జీలపై బహిరంగ చర్చకు సిద్ధం: వైసీపీకి బీజేపీ సవాల్

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (10:31 IST)
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువుగా వసూలు చేస్తున్నారని బీజేపీ నేత పాతూరి నాగభూషణం ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా చూడటం సరి కాదన్నారు.

ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం రెడ్డి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల విషయంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని... దమ్ముంటే వైసీపీ నేతలు రావాలని సవాల్ విసిరారు. ఏపీలో కరెంటు కోతలు లేవంటే.. అది కేంద్రం అమలు చేస్తున్న విధానాల వల్లే అన్నారు.

కరోనా కష్టకాలంలో ప్రజలు ఉంటే.. రెండు, మూడు నెలల  బిల్లును ఒకేసారి ఇచ్చి  శ్లాబు పెంచి వసూలు చేశారని ఆయ‌న ఆరోపించారు. బీజేపీ సీనియర్ నేత సత్యమూర్తి మాట్లాడుతూ... కరోనా కష్ట కాలంలో మోదీ చేపట్టిన చర్యలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.

ఈ ఏడాది పాలనలో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటు, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. బీజేపీ ఏపీకి చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

తెలుగువాళ్లకు గర్వకారణమైన పీవీ శతజయంతి ఉత్సవాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఆయన సేవలకు గుర్తుగా జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments