Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం - మిస్టరీ మరణాలుగా మిగిలిపోవు!!

ఠాగూర్
శనివారం, 8 మార్చి 2025 (13:34 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరైన వాచ్‌మెన్ రంగన్న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతదేహానికి పోలీసులు శనివారం రీపోస్టుమార్టం చేశారు. పులివెందుల భాకరాపురం శ్మశానవాటికలో ఈ రీపోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేశారు. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని రంగయ్య భార్య ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. పైగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సందేహాల నివృత్తి కోసం మరోమారు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయా? లేవా? అనే అంశాన్ని పోలీసులు పరిశీలించారు. 
 
ఇదిలావుంటే, వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు. సాక్షుల మరణాలపై కేబినెట్ మీటింగ్‌లో చర్చించామన్నారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. వివేకా హత్య కేసులో ఎవరి మరణాలు అయినా మిస్టరీగా మాత్రం మిగిలిపోవన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా, తపప్ు చేసిన వారికి  శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు. రంగన్న పోస్ట్ మార్టం రత్వాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments