Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్... నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటుంటే నమ్మి మోసపోయా.. : మాజీ మంత్రి రావెల

వరుణ్
శుక్రవారం, 7 జూన్ 2024 (13:36 IST)
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఇపుడు ఏకంగా 11 స్థానాలకు పరిమితమైంది. ఐదేళ్ళ పాటు అధికారంలో ఉన్న వైకాపాకు ఇపుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. దీంతో ఆ పార్టీలోని అనేక మంది సీనియర్ నేతలు ఓ ఓటమిని జీర్ణించుకోలేక, వైకాపాకు ఇక భవిష్యత్ లేదని గ్రహించి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ముందు వరుసలో నిలిచారు. ఆయన వైకాపాకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఆయన మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. 
 
ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. తాను డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి పని చేశానని, 2014లో తనకు చంద్రబాబు రాజకీయంగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. 2014 ఏపీలో తొలి సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా పని చేసేందుకు అవకాశం కల్పించారని, ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. అయితే, కొన్ని కారణాలతో ఆ పార్టీలో ఇమడలేక వైకాపాలో చేరానని తెలిపారు. జగన్ నోటి వెంట పదేపదే నా ఎస్సీ, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ మాట్లాడుతుంటే నమ్మి మోసపోయానని చెప్పారు.
 
ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలో పని చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదని గుర్తు చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు రాజ్యాధికారం తెస్తానని మాట నమ్మి ఆ పార్టీ చేరగా, ఈ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఆయనను తిరస్కరించారని చెప్పారు. ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు నాయుడుకి శుక్షాకాంక్షలు తెలుపుతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments