Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలో రేప్ ప్రాక్టికల్స్... విద్యార్థులతో డెమో చేయించిన కీచక టీచర్లు

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (09:16 IST)
విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన గురువులు... తమలోని వక్రబుద్ధిని బయటపెట్టారు. విద్యార్థులతో రేప్ డెమో చేయించారు. ఈ డెమో చేస్తూ ఓ విద్యార్థిని గాయపడింది. దీంతో ఈ విషయం బయటకు పొక్కడంతో గ్రామస్థులు ఆ ఇద్దరు ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేశారు. 
 
ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, చింతలపూడి ప్రైమరీ పాఠశాలలో రాజశేఖర్, ఉమామహేశ్వర రావులు స్థానికంగా ఉండే ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈ ఇద్దరు టీచర్లకు ఓ వికృతమైన ఆలోచన వచ్చింది. 
 
ఈ ఆలోచన వచ్చిందే తడవుగా నేరుగా తరగతి గదిలోకి వెళ్లి... అత్యాచారం ఎలా చేస్తారో చేసి చూపించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు మార్గం లేక.. తరగతి గదిలోనే రేప్ డెమోకు పూనుకున్నారు. ఈ డెమో చేస్తూ ఓ విద్యార్థిని గాయపడింది. 
 
ఫలితంగా ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన గ్రామస్థులు ఇద్దరు ఉపాధ్యాయులను పట్టుకుని చితకబాదారు. పైగా, ఈ విషయం విద్యాశాఖ ఉన్నతాధికారులకు, పోలీసులకు తెలిస్తే తమ ఉద్యోగాలు పోతాయని భావించి, గ్రామస్థులతో రాజీకొచ్చారు. ఇందుకోసం వారు తలా రూ.80 వేలు చొప్పున చెల్లించారు. 
 
అయితే, ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి.. చివరకు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. చిన్నారులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments