Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకుపోయి?

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (14:33 IST)
ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఈ దుర్ఘటన మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తుర్కపల్లిలో గురువారం చోటుచేసుకుంది. చంద్రయ్య, కృష్ణవేణి దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం మెదక్‌ జిల్లా నుంచి నగరానికి వలస వచ్చి తుర్కపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 
 
గురువారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న పాప కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా కనిపించలేదు. చివరికి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. రాత్రి 12 గంటల సమయంలో అటుగా వెళ్తున్న కొందరికి శవం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అది పాపదేనని గుర్తించారు. 
 
పోస్ట్‌మార్టం చేయించారు. బాలికను అత్యాచారం చేసి గొంతు నులిమి చంపినట్లు పంచనామాలో తేలింది. బాధితురాలి ఇంటి ప్రక్కన ఉన్న బిహార్‌కు చెందిన ఆరుగురు యువకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments