Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ కేసీఆర్.. 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి: రామోజీరావు కితాబు

తెలుగు భాషను తెలంగాణలో తప్పనిసరి చేయడంతో పాటు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అభినందనలు తెలిపారు. తెలుగు భాషను 12వ త

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (18:11 IST)
తెలుగు భాషను తెలంగాణలో తప్పనిసరి చేయడంతో పాటు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అభినందనలు తెలిపారు. తెలుగు భాషను 12వ తరగతి వరకు తప్పనిసరి చేయడం గొప్ప విషయమని కేసీఆర్‌ను ఆయన కొనియాడారు.

ఇంకా పాలనా వ్యవహరాల్లో తెలుగును అనివార్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు భాషకు గుర్తింపు రావాలంటే, తెలుగు కనుమరుగు కాకుండా వుండాలంటే.. ఇదేవిధంగా ముందుకు సాగాలని.. ఉద్యోగ నియామకాల్లో కూడా తెలుగు ప్రజ్ఞను అనివార్యం చేయాలని సూచించారు. 
 
ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రామోజీ రావు లేఖ రాశారు. ప్రపంచ తెలుగు మహాసభలను తొలిసారి రాష్ట్రంలో నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. తెలుగు భాషను మరింత విస్తృతం చేయాలంటే... పరిపాలనా వ్యవహారాల్లో కూడా తెలుగును తప్పనిసరి చేయాలని రామోజీరావు తన లేఖలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేయడం బలమైన నిర్ణయమని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments