Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాలనపై రజనీ.. ప్రజా సేవ కోసం వచ్చాం..

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (16:32 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై  చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒక ఎడ్యుకేటెడ్ ప‌ద్ధ‌తి ప్రకారం ప‌రిపాల‌న‌ను సాగిస్తుందని చెప్పారు. వైసీపీ పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. సీఎం జగన్ ప్రతి పేద వాడి కష్టాన్ని చూసారని, తప్పకుండా అందరికి న్యాయం చేస్తారని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాదు జగన్ మాపై ఉంచిన నమ్మకానికి వంద రెట్లు ప్రజలు మాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు తప్పకుండా అందరికి న్యాయం చేస్తామని వెల్లడించారు. చిల‌క‌లూరిపేట‌లోని కొన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జరిగిన‌ట్టు త‌న దృష్టికి వ‌చ్చింద‌ని, ఎలాంటి అవకతవకలకు, ఒత్తిళ్లకు వైసీపీ ప్రభుత్వం తావు ఇవ్వబోదని తేల్చి చెప్పేశారు. 
 
జగన్ మంత్రివర్గంలో స్థానం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. పదవుల కోసం రాజకీయాలలోకి రాలేదని, ప్రజా సేవ కోసమే తాను రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. అయితే ప్రజలు ఆశీర్వదించినట్టే దేవుడి ఆశీస్సులు కూడా ఉంటే ఎంతటి పదవులైనా దక్కడం సులభమేనన్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments