Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయంలో అడుగుపెట్టిన జగన్... 8.39 నిమిషాలకు ఎంట్రీ

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (09:16 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలోకి అడుగుపెట్టారు. శనివారం సరిగ్గా ఉదయం 8.39 గంటలకు ఆయన లోనికి ప్రవేశించారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. 
 
నిజానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన సచివాలయానికి వస్తారని ఉద్యోగులంతా భావించారు. కానీ, ఆయన నేరుగా తన ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఇపుడే ఆయన తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టారు. 
 
అనుకున్న ముహూర్తానికి సెక్రటేరియట్‌లోని తొలి బ్లాక్‌ మొదటి అంతస్తులో ఉన్న కార్యాలయంలో అడుగుపెట్టిన జగన్ ఉదయం 9.30 గంటలకు  అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే, ఉదయం 11:15 గంటలకు జరగనున్న ప్రొటెం స్పీకర్  శంబంగి చినఅప్పలనాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా జగన్ హాజరుకానున్నారు. 
 
అంతకుముందు సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన జగన్‌కు సచివాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత తన నూతన కార్యాలయంలోకి వెళ్ళిన తర్వాత జగన్‌మోహన్ రెడ్డిని వేదమంత్రోచ్ఛారణలతో వేద పండితులు ఆశీర్వదించారు. సచివాలయంలో జగన్ బాధ్యతలు స్వీకరించారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. 8:50 గంటలకు వైఎస్ మొదటి సంతకం చేశారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments