తెదేపాలో తగిన గుర్తింపు లేదు .. అందుకే తప్పుకుంటున్నా : శోభా హైమావతి

Webdunia
శనివారం, 17 జులై 2021 (15:58 IST)
తెలుగు దేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి పార్టీకి రాజీనామా చేశారు. విశాఖపట్నం జిల్లా ఎస్.కోట నియోజకవర్గం నుంచి గతంలో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
 
అయితే, గత కొంతకాలంగా తనకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతో పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. పైగా, ఈమె తెదేపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా ఆమె పని చేశారు.
 
మరోవైపు ఆమె వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై ఆమె స్పందించలేదు. అలాగనీ ఖండించనూ లేదు. దీంతో ఆమె వైకాపా కండువా కప్పుకోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఇదిలావుంటే, గత ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుదారులుగా వ్యవహరిస్తున్నారు. పలువురు నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో కూడా పార్టీకి ఇటీవలే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అధికార తెరాసలో చేరిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments