జగన్‌ పదేపదే హోదాపై మాట్లాడటం సరికాదు: పురంధేశ్వరి

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (13:45 IST)
రెండు నెలల పాలనలో వైసీపీ ప్రజలకు విశ్వాసం కల్పించలేకపోయిందని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ ఇసుకపై స్పష్టమైన విధానం ప్రకటించకపోవడంతో నిర్మాణరంగం కుదేలైందన్నారు. గోదావరి జలాలపై జగన్‌.. ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఏపీకి హోదా ఇచ్చే అవకాశంలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని స్పష్టం చేశారు. జగన్‌ పదేపదే హోదాపై మాట్లాడటం సరికాదన్నారు. విభజన చట్టంలోని అంశాలను 90శాతం కేంద్రం అమలు చేసిందని పురంధేశ్వరి పేర్కొన్నారు.
 
అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి కూడా జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే కేసీఆర్‌కు ఏపీని జగన్‌ తాకట్టుపెడుతున్నారంటూ మండిపడ్డారు. ఏపీ విషయంలో జగన్‌ చారిత్రక తప్పిదం చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి మిగులు జలాలపై.. కేసీఆర్‌ ప్రతిపాదనకు జగన్‌ అంగీకరించడం సరైంది కాదని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments