Webdunia - Bharat's app for daily news and videos

Install App

యానం పుష్కర ఘాట్‌లో చిక్కిన పులస - రూ.26 వేలకు విక్రయం

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (08:55 IST)
అత్యంత రుచికరమైన చేరగా పేరుకెక్కిన పులస చేప కోసం ధనవంతులు ఎంత ధరకైనా చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. ఒక్కో సందర్భాల్లో దీని ధర ఇది వేల నుంచి లక్షల్లో కూడా పలుకుతుంది. తాజాగా యానాం పుష్కర ఘాట్‌‍లో పులస చేప ఓ జాలరికి చిక్కింది. దీన్ని ఓ మహిళ రూ.19 వేలకు కొనుగోలు చేసింది. ఆమె నుంచి మరో రాజకీయ నేత రూ.26 వేలకు దక్కించుకున్నారు. 
 
మంగళవారం సాయంత్రం యానాం పుష్కర ఘాట్‌లో ఓ జాలరి వలకు ఈ పులస చిక్కడంతో అతని పంట పండింది. రెండు కిలోల బరువున్న ఈ చేపను వేలం చేయగా నాలక్ష్మి అనే మహిళ రూ.19 వేలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇదే చేపను రావులపాలేనికి చెందిన ప్రముఖ నాయుకుడి కోసం ఓ వ్యక్తి రూ.26 వేలకు కొనుగోలు చేశాడు. ఈ సీజన్‌లో పులసకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గోదావరి నదికి ఎదురీదే ఈ పులస చేప ఇతర చేపల వంటకాల కంటే అత్యంత రుచికరంగా ఉంటుంది. దీనికితోడు ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ చేప కోసం ధనవంతులు పోటీపడుతుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments