Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం వస్తున్నారు... మందులు షాపు, ఆస్పత్రి మూసివేయాల్సిందే...

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (13:02 IST)
ఈ దారిలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు.. అందువల్ల ఈ రహదారిలో ఉండే మందుల షాపు, ఆస్పత్రి మూసివేయాల్సిందే. లేదంటే మేమే మూసివేస్తాం అంటూ షాపు యజమానులకు గట్టివార్నింగ్ ఇచ్చారు. దీంతో బెదిరిపోయిన యజమానులు షాపులు మాసివేశారు. 
 
మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనుంది. ఈ భేటీకి ముఖ్యమత్రి జగన్ హాజరవుతున్నారు. దీంతో ఆయన సచివాలయానికి రానున్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖలకు రుణాల మంజూరుపై బ్యాంకు ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. 
 
ఈ నేపథ్యంలో, పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మందడంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రైతుల మహా ధర్నా కార్యక్రమానికి కూడా అనుమతి ఇవ్వలేదు. జాతీయ రహదారి దిగ్బంధనానికి బయల్దేరిన రైతులు, రైతు కూలీలను కూడా అడ్డుకున్నారు. 
 
అంతేకాదు మందడంలో మెడికల్ షాపులను కూడా బంద్ చేయించారు. సాధారణంగా ఎలాంటి బంద్‌కు అయినా మందుషాపులు, పాల సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదు. కానీ, సీఎం జగన్ సచివాలయానికి వస్తుంటే మందుల షాపులతో పాటు... చివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా మూసివేయించడం ఇది చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments