Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఠాగూర్
ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (21:13 IST)
విజయవాడ నగరంలో స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 13 మంది మహిళలతో పాటు ఐదుగురు విటులు కూడా ఉన్నారు. ఈ ఐదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ నెల 22వ తేదీన విజయవాడ నగరంలో ఓ రాజకీయ పార్టీ యూట్యూబ్ చానెల్ కార్యాలయం ఉన్న భవనంలో స్పా సెంటర్ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ భవంతిపై శుక్రవారం అర్థరాత్రి మాచవరం పోలీసులు సోదాలు నిర్వహించారు. నగరంలోని వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో ఉన్న స్టూడియోల 9 స్పా సెంటరుపై మాచవరం సీఐ ప్రకాష్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీస్ బృందం ఈ తనిఖీలు నిర్వహించింది. 
 
యూట్యూబ్ చానెల్ భవనంలో స్పా సెంటరు పేరుతో వ్యభిచారం సాగిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఇందులో 13మంది మహిళలతో పాటు ఐదుగురు రాజకీయ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు. పట్టుబడిన మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరి నుంచి నగదుతో పాటు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments