Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ జానపదకళాకారుడు వంగపండు మృతి

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (07:52 IST)
ప్రపంచం మెచ్చిన జానపదకళాకారుడు, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు మృతి చెందారు. తను మలచిన పాటను మనకు వదలి పరలోకానికి పయనమైపోయారు.

ఈ ప్రముఖ వాగ్గేయకారుడు కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈయన 1972 జననాట్య మండలిని స్థాపించి, జానపద గేయాలతో పల్లెకారులతో పాటు గిరిజనులను చైతన్యపరిచారు.

తన జీవిత కాలంలో వందలాది జానపదాలకు వంగపండు గజ్జెకట్టారు. 2017లో కళారత్న పురస్కారం అందుకున్నారు. కళాకారులు కుల మతాలు, ప్రాంతీయ భేదాలు ఉండవు అనడానికి సరైన తార్కాణం ప్రజాకవి వంగపండు అనడంలో అతి సయోక్తి లేదు.

ఉత్తరాంధ్రలో పుట్టి ఉత్తరాంధ్రలో పెరిగి తెలంగాణ ప్రాంతంలోరణం, మునసబు, పెత్తందారీల ఆగడాలపై ఆయన స్వయంగా రచించి ప్రదర్శించిన భూభాగోతం ఇందుకు తార్కాణం. వంగపండు మరణంపై ప్రజాగాయకుడు గద్దర్‌ స్పందిస్తూ.. వంగపండు పాట కాదు ప్రజల గుండె చప్పడు అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments