Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడలో రౌడీలపై పోలీసులు దృష్టి!

విజయవాడలో రౌడీలపై పోలీసులు దృష్టి!
, శుక్రవారం, 17 జులై 2020 (09:47 IST)
విజయవాడలో ఇటీవ‌ల జరిగిన గ్యాంగ్ వార్ ఒక్కసారిగా నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోని విచారించారు.

గొడవతో సంబంధం ఉన్నవాళ్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అదే క్ర‌మంలో న‌గ‌రంలోని మొత్తం రౌడీషీటర్ల ఏరివేతపై పోలీసులు ప్ర‌త్యేక దృష్టి సారించారు. 400 మందికి పైగా రౌడీషీటర్లను బెజవాడ నగరంలో గుర్తించ‌డంతో పాటు వారిలో 70 మంది ప్రస్తుతం త‌మ కార్య‌క‌లాపాలు య‌ధావిధిగా కొన‌సాగిస్తున్న‌ట్లు నిర్దారించారు.

రాత్రి పూట వారి కదలికలపై నిఘా పెట్టి అతిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న నలుగురిని నగర బహిష్కరణ చేశారు. మరికొందరిని కూడా నగర బహిష్కరణ కోసం లిస్ట్ ఔట్ చేశామని నగర పోలీస్ క‌మిషన‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు తెలిపారు.

రౌడీషీటర్లు ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ సేవించడంతో పాటు విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు జరుపుతున్నట్టుగా కూడా పో‌లీసులు గుర్తించారు. చాలామంది విద్యార్థులు మ‌త్తు ప‌దార్థాల‌కు బానిసల‌వుతున్నారని ఈ క్ర‌మంలో తల్లిదండ్రులు మ‌రింత అప్రమత్తంగా ఉండాలి సీపీ సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ పాలనలో దళితులు ద్వితీయ శ్రేణి పౌరుల్లా బతుకుతున్నారు: వర్ల రామయ్య