Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ బందోబస్తు మధ్య ఆనందయ్య కరోనా మందు తయారీ

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (08:13 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్న గ్రామంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా బాధితుల కోసం పంపిణీ చేసే మందు తయారీని మళ్లీ ప్రారంభించనున్నారు. ఏపీ హైకోర్టుతో పాటు.. ఏపీ ప్రభుత్వ అనుమతితో ఈ మందును సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. 
 
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ కాంప్లెక్స్‌లో దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా చేస్తున్నారు. ఆయుర్వేద మందు తయారీ ప్రక్రియకు నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. 
 
నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నుంచి తయారీ మొదలు కావచ్చని, మందు తయారీకి మరో మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. తొలుత సర్వేపల్లి నియోజక వర్గానికి లక్ష ప్యాకెట్లు సిద్ధం చేయనున్నారు. 
 
మరోవైపు, ఆనందయ్య అందిస్తున్న కరోనా మందు తయారీలో భాగస్వాములయ్యేందుకు గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరుకు చెందిన నితిన్‌ సాయి ముందుకొచ్చారు. ఆయన విశాఖ గీతం వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 
 
ఆనందయ్య మందు తయారీకి అవసరమైన 1.5 టన్నుల పసుపు కొమ్ములను ప్రత్యేక వాహనంలో వెల్లటూరు నుంచి కృష్ణపట్నానికి గురువారం పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments