Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్లక్ష్యం ఖరీదు.. నిండు గర్భిణి ప్రాణం, ఆసుపత్రి బయటే మృతి

Webdunia
సోమవారం, 3 మే 2021 (23:08 IST)
రంపచోడవరం, మారేడుమిల్లి: సకాలంలో వైద్యసేవలు అందక నిండు గర్భిణి ఆదివారం మృతి చెందారు. దాంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
 
వారి వివరాల ప్రకారం.. మారేడుమిల్లి మండలం పూజారిపాకలుకు చెందిన తొమ్మిది నెలల గర్భిణి పూజారి విజయకుమారి(26)కి ఆదివారం ఉదయం పురిటినొప్పులొచ్చాయి. దాంతో భర్త కృష్ణారెడ్డి మారేడుమిల్లి పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు.
 
వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ, నర్సు సేవలందించారు. పరిస్థితి విషమించడంతో ప్రాంతీయ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అంబులెన్సులో రంపచోడవరం ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటికీ, ఓపీ రాయించుకు రావాలని వైద్యసిబ్బంది కాలయాపన చేయడంతో ఆసుపత్రి బయటే ఆమె సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 
 
వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని ఆశ వర్కర్ల యూనియన్‌ నేత మట్ల వాణిశ్రీ, సెంటర్‌ఫర్‌ రైట్స్‌ అధ్యక్షుడు బాలు అక్కిస ఆరోపించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments