Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌లో ఉంటున్నవారిపై జాగ్రత్తలు : మంత్రి మోపిదేవి

Quarantine
Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (09:03 IST)
గుంటూరు జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరగడం దురదృష్టకరమని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 109 పాజిటీవ్ కేసులు నమోదయినట్లుగా చెప్పారు.

ఇలాంటి సమయంలో క్వారంటైన్‌లో ఉంటున్నవారిపై జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు. కరోనాపై ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుదని చెప్పారు.

గుంటూరు జిల్లాలో మొత్తం 32 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని,  5,190 మందికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 14 రోజులు క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత ఇంటికి పంపించాలని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడిలు వస్తున్నాయని మంత్రి మోపిదేవి అన్నారు.

అయితే 28 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్నవారికి నెగిటీవ్ రిపోర్టు వచ్చి.. బయటకు వెళ్లిన తర్వాత వారికి మళ్లీ పాజిటీవ్ వచ్చే అవకాశం ఉందని, జాతీయ స్థాయిలో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు.

ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 28 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టంగా చెబుతున్నామని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని మంత్రి మోపిదేవి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments