Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌లో ఉంటున్నవారిపై జాగ్రత్తలు : మంత్రి మోపిదేవి

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (09:03 IST)
గుంటూరు జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరగడం దురదృష్టకరమని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 109 పాజిటీవ్ కేసులు నమోదయినట్లుగా చెప్పారు.

ఇలాంటి సమయంలో క్వారంటైన్‌లో ఉంటున్నవారిపై జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు. కరోనాపై ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుదని చెప్పారు.

గుంటూరు జిల్లాలో మొత్తం 32 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని,  5,190 మందికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 14 రోజులు క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత ఇంటికి పంపించాలని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడిలు వస్తున్నాయని మంత్రి మోపిదేవి అన్నారు.

అయితే 28 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్నవారికి నెగిటీవ్ రిపోర్టు వచ్చి.. బయటకు వెళ్లిన తర్వాత వారికి మళ్లీ పాజిటీవ్ వచ్చే అవకాశం ఉందని, జాతీయ స్థాయిలో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు.

ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 28 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టంగా చెబుతున్నామని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని మంత్రి మోపిదేవి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments