Webdunia - Bharat's app for daily news and videos

Install App

1,056 మద్యం బాటిళ్ల స్వాధీనం..ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (21:30 IST)
మచిలీపట్నం ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుండి జిల్లాలోకి అక్రమ మద్యం చొరబడకుండా, సరిహద్దు ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిత్యం వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.

కొంతమంది అక్రమ ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని నేరాలు చేస్తున్నారు. అక్రమ మద్యం రవాణాకు పూనుకుని పోలీసుల వలకు చిక్కుతున్నారు.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా పందిలపల్లి గ్రామానికి చెందిన దివ్యభారతి, మల్లేశ్వరి అనే ఇద్దరు మహిళలు, ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి టాటా ఇండికా కారులో 20 కేసులలో మొత్తం 1056 మద్యం బాటిల్ ఎక్కించి వాటిని నందిగామ తరలించే క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున పోలీసులకు పట్టుబడ్డారు.

పోలీసు ప్రత్యేక బృందం ఎస్ఐ మురళీకృష్ణ, సాండ్ మొబైల్ పార్టీ సిబ్బందితో కలసి వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంట్యాలవారి గూడెం వద్ద కాపు కాసి వాహన తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అక్రమ మద్యాన్ని కారులో తరలిస్తున్న వాహన డ్రైవర్ పోలీసులను చూసి పారిపోయారు.

పోలీసులు కారును తనిఖీ చేయటంతో 1,056 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను వత్సవాయి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిరువురిపై వత్సవాయి పోలీస్ స్టేషన్లో  ఎక్సైజ్ కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments