Webdunia - Bharat's app for daily news and videos

Install App

1,056 మద్యం బాటిళ్ల స్వాధీనం..ఎక్కడ?

liquor bottles
Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (21:30 IST)
మచిలీపట్నం ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుండి జిల్లాలోకి అక్రమ మద్యం చొరబడకుండా, సరిహద్దు ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిత్యం వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.

కొంతమంది అక్రమ ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని నేరాలు చేస్తున్నారు. అక్రమ మద్యం రవాణాకు పూనుకుని పోలీసుల వలకు చిక్కుతున్నారు.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా పందిలపల్లి గ్రామానికి చెందిన దివ్యభారతి, మల్లేశ్వరి అనే ఇద్దరు మహిళలు, ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి టాటా ఇండికా కారులో 20 కేసులలో మొత్తం 1056 మద్యం బాటిల్ ఎక్కించి వాటిని నందిగామ తరలించే క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున పోలీసులకు పట్టుబడ్డారు.

పోలీసు ప్రత్యేక బృందం ఎస్ఐ మురళీకృష్ణ, సాండ్ మొబైల్ పార్టీ సిబ్బందితో కలసి వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంట్యాలవారి గూడెం వద్ద కాపు కాసి వాహన తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అక్రమ మద్యాన్ని కారులో తరలిస్తున్న వాహన డ్రైవర్ పోలీసులను చూసి పారిపోయారు.

పోలీసులు కారును తనిఖీ చేయటంతో 1,056 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను వత్సవాయి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిరువురిపై వత్సవాయి పోలీస్ స్టేషన్లో  ఎక్సైజ్ కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments