Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌పై పవన్ విమర్శలు చేయడం మానుకోవాలి : పోసాని కృష్ణ మురళి

Webdunia
సోమవారం, 10 జులై 2023 (10:19 IST)
సీఎం జగన్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అదేపనిగా ఆరోపణలు చేస్తుండడం మానుకోవాలని ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి హితవు పలికారు. జగన్ అవినీతికి పాల్పడ్డాడని పవన్ ఒక్క ఆధారమైనా చూపించగలరా అని పోసాని సవాల్ విసిరారు.
 
అసలు, పవన్‌కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందని తాను అనుకోవడంలేదని, సీఎం జగన్‌ను ఓడించడం పవన్ వల్ల అయ్యేపనేనా? అని ప్రశ్నించారు. మాట్లాడితే జగన్‌ను గద్దె దించుతా అంటున్నాడని, వాస్తవానికి పవన్‌కు అంత బలం లేదని పోసాని స్పష్టం చేశారు. 
 
పవన్ అంత శక్తిమంతుడే అయితే, గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే చిరంజీవిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేకపోయాడని నిలదీశారు. వయసు రీత్యా జగన్... పవన్ కంటే చిన్నవాడని, తనకంటే చిన్నవాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంతో పవన్ ఓర్వలేకపోతున్నాడని పోసాని విమర్శించారు. 
 
తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారంటున్న పవన్ కల్యాణే మొదట తిట్టడం ప్రారంభించారని స్పష్టంచేశారు. అంతేకాకుండా, పవన్ కాపులను కూడా మోసం చేస్తున్నాడని, కాపుల కోసం పదవులు త్యాగం, ముద్రగడ పద్మనాభంను తిట్టించడం పవన్‌కు తగదని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments