Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌పై పవన్ విమర్శలు చేయడం మానుకోవాలి : పోసాని కృష్ణ మురళి

posani krishnamurali
Webdunia
సోమవారం, 10 జులై 2023 (10:19 IST)
సీఎం జగన్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అదేపనిగా ఆరోపణలు చేస్తుండడం మానుకోవాలని ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి హితవు పలికారు. జగన్ అవినీతికి పాల్పడ్డాడని పవన్ ఒక్క ఆధారమైనా చూపించగలరా అని పోసాని సవాల్ విసిరారు.
 
అసలు, పవన్‌కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందని తాను అనుకోవడంలేదని, సీఎం జగన్‌ను ఓడించడం పవన్ వల్ల అయ్యేపనేనా? అని ప్రశ్నించారు. మాట్లాడితే జగన్‌ను గద్దె దించుతా అంటున్నాడని, వాస్తవానికి పవన్‌కు అంత బలం లేదని పోసాని స్పష్టం చేశారు. 
 
పవన్ అంత శక్తిమంతుడే అయితే, గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే చిరంజీవిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేకపోయాడని నిలదీశారు. వయసు రీత్యా జగన్... పవన్ కంటే చిన్నవాడని, తనకంటే చిన్నవాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంతో పవన్ ఓర్వలేకపోతున్నాడని పోసాని విమర్శించారు. 
 
తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారంటున్న పవన్ కల్యాణే మొదట తిట్టడం ప్రారంభించారని స్పష్టంచేశారు. అంతేకాకుండా, పవన్ కాపులను కూడా మోసం చేస్తున్నాడని, కాపుల కోసం పదవులు త్యాగం, ముద్రగడ పద్మనాభంను తిట్టించడం పవన్‌కు తగదని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments